ముంబై ఇండియన్స్తో జరుగుతున్న మ్యాచ్లో సన్రైజర్స్ బ్యాటింగ్ విభాగం అద్భుతంగా ఆడింది. అభిషేక్ శర్మ (9) విఫలమైనా కూడా.. మరో ఓపెనర్ ప్రియమ్ గార్గ్ (42), రాహుల్ త్రిపాఠీ (76), నికోలస్ పూరన్ (38) ముగ్గురూ అద్భుతమైన ఆటతీరు కనబరిచారు. దాంతో సన్రైజర్స్ స్కోరు 200 దాటేలా కనిపించింది. అయితే రమణ్దీప్ సింగ్ బౌలింగ్లో త్రిపాఠీ, మార్క్రమ్ (2) ఇద్దరూ పెవిలియన్ చేరడంతో ఆ అవకాశాలు దెబ్బతిన్నాయి.
పూరన్ను కూడా మెరెడిత్ అవుట్ చేశాడు. అయినా భారీ స్కోరు చేసే అవకాశం కనిపించింది. అయితే అలవాటుకు భిన్నంగా లోయర్ ఆర్డర్లో వచ్చిన కెప్టెన్ కేన్ విలియమ్సన్ (8 నాటౌట్) భారీ షాట్లు ఆడలేకపోయాడు. ఫామ్లేమితో బాధపడుతున్న అతనికి జోడీగా నిలిచిన వాషింగ్టన్ సుందర్ (9) కూడా బంతిని బౌండరీ దాటించలేకపోయాడు.
దాంతో నిర్ణీత 20 ఓవర్లు ముగిసే సరికి సన్రైజర్స్ జట్టు 6 వికెట్ల నష్టానికి 193 పరుగులు చేసింది. ముంబై బౌలర్లలో రమణ్దీప్ సింగ్ మూడు వికెట్లతో సత్తా చాటగా.. బుమ్రా, డానియల్ శామ్స్, రైలీ మెరెడిత్ తలో వికెట్ తీసుకున్నారు.
Rahul Tripathi is our Top Performer from the first innings for his excellent knock of 76 off 44 deliveries.
A look at his batting summary here 👇👇 #TATAIPL #MIvSRH pic.twitter.com/Ok9LOdfJ6b
— IndianPremierLeague (@IPL) May 17, 2022