ప్లేఆఫ్స్ ఆశలు సజీవంగా ఉండాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్లో సన్రైజర్స్ బ్యాటర్లు ధాటిగా ఆడుతున్నారు. ముంబై ఇండియన్స్ సారధి టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకోవడంతో.. బ్యాటింగ్కు వచ్చిన సన్రైజర్స్కు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఫామ్లో ఉన్న యువ ఆటగాడు అభిషేక్ శర్మ (9) తక్కువ స్కోరుకే పెవిలియన్ చేరాడు.
అయితే ఆ తర్వాత వచ్చిన రాహుల్ త్రిపాఠీతో కలిసి కొత్త ఓపెనర్ ప్రియామ్ గార్గ్ అద్భుతంగా ఆడాడు. వీళ్లిద్దరూ ధాటిగా ఆడటంతో సన్రైజర్స్ జట్టు 6 ఓవర్లకు ఒక వికెట్ నష్టానికి 57 పరుగులు చేసింది.