ముంబైతో జరుగుతున్న కీలకమైన మ్యాచ్లో సన్రైజర్స్కు తొలి ఎదురుదెబ్బ తగిలింది. ఫామ్లో ఉన్న ఓపెనర్ అభిషేక్ శర్మ (9) మూడో ఓవర్లోనే పెవిలియన్ చేరాడు. డానియల్ శామ్స్ వేసిన బంతిని భారీ షాట్ ఆడటానికి ప్రయత్నించిన అభిషేక్ విఫలమయ్యాడు. ఈ క్రమంలో గాల్లోకి లేచిన బంతిని మిడాఫ్ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న మార్కండే సులభంగా పట్టేశాడు. దీంతో అభిషేక్ నిరాశగా పెవిలియన్ చేరాడు. సన్రైజర్స్ జట్టు 18 పరుగులకే తొలి వికెట్ కోల్పోయి కష్టాల్లో పడింది.