సన్రైజర్స్తో జరుగుతున్న మ్యాచ్లో ముంబై ఇండియన్స్కు తొలి షాక్ తగిలింది. ధాటిగా ఆడుతూ ఛేజింగ్ను నడిపిస్తున్న ముంబై సారధి రోహిత్ శర్మ (48) పెవిలియన్ చేరాడు. అతను ఆడుతున్న తీరు చూసి కచ్చితంగా హాఫ్ సెంచరీ సాధిస్తాడని అంతా అనుకున్నారు. కానీ వాషింగ్టన్ సుందర్ వేసిన 11వ ఓవర్లో వారి ఆశలు ఆవిరయ్యాయి.
సుందర్ వేసిన బంతిని భారీ షాట్ ఆడేందుకు ప్రయత్నించిన అతను.. టైమింగ్ మిస్ అయ్యాడు. దాంతో గాల్లోకి లేచిన బంతిని సబ్స్టిట్యూట్ ఫీల్డర్ సుచిత్ అందుకున్నాడు. రోహిత్ అవుటవడంతో ముంబై అభిమానులంతా ఒక్కసారిగా నిరాశలో కూరుకుపోయారు. ఆ జట్టు 11 ఓవర్లు ముగిసే సరికి 1 వికెట్ నష్టానికి 97 పరుగులు చేసింది.
ఆ తర్వాత కాసేపటికే ఇషాన్ కిషన్ (43) కూడా అవుటయ్యాడు. ఉమ్రాన్ మాలిక్ వేసిన బంతిని భారీ షాట్ ఆడేందుకు ప్రయత్నించిన అతను లాంగాన్ మీదుగా బంతిని తరలించే ప్రయత్నం చేశాడు. అయితే టైమింగ్ సరిగా కుదరకపోవడంతో బంతి ఎక్కువ దూరం వెళ్లలేదు. రింగ్లో ఫీల్డింగ్ చేస్తున్న ప్రియమ్ గార్గ్ వెనక్కు తిరిగి పరిగెడుతూ క్యాచ్ అందుకోవడంతో ఇషాన్ పెవిలియన్ చేరాడు.