ముంబైతో జరుగుతున్న మ్యాచ్లో ధాటిగా ఆడిన యువ ఓపెనర్ ప్రియమ్ గార్గ్ (42) అవుటయ్యాడు. మరో ఓపెనర్ అభిషేక్ (9) స్వల్ప పరుగులకే అవుటవడంతో కష్టాల్లో పడిన జట్టును గార్గ్ ఆదుకున్నాడు. ధాటిగా ఆడుతూ స్కోరు బోర్డును ముందుకు తీసుకెళ్లాడు. ఈ క్రమంలో రాహుల్ త్రిపాఠీకి చక్కని సహకారం అందించాడు.
ముంబై సారధి రోహిత్ ఎంత మంది బౌలర్లను మార్చినా వికెట్ మాత్రం దక్కలేదు. చివరకు పార్ట్ టైమర్ రమణ్ దీప్ సింగ్ బౌలింగ్లో గార్గ్ అవుటయ్యాడు. సింగ్ వేసిన బంతిని నేరుగా ఆడే క్రమంలో గార్గ్ ఇచ్చిన లోక్యాచ్ను బౌలర్ చక్కగా అందుకోవడంతో సన్రైజర్స్ జట్టు 96 పరుగుల వద్ద రెండు వికెట్లు కోల్పోయింది.