భారీ లక్ష్యంతో బరిలో దిగిన ముంబై ఇండియన్స్కు రెండో ఓవర్లోనే తొలి దెబ్బ తగిలింది. ముంబై కెప్టెన్, స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ (10) అవుటయ్యాడు. ప్రసిద్ధ్ కృష్ణ వేసిన సులభమైన బంతిని పాయింట్ దిశగా మరల్చడంలో రోహిత్ విఫలమయ్యాడు. అక్కడ ఫీల్డింగ్ చేస్తున్న రియాన్ పరాగ్ అద్భుతంగా అందుకున్న క్యాచ్తో రాజస్థాన్ శిబిరం సంబరాల్లో మునిగిపోయింది.
రోహిత్ నిరాశగా వెనుతిరిగాడు. ముంబై అభిమానులంతా షాక్ తిన్నారు. రోహిత్ వికెట్తో ముంబై జట్టు రెండు ఓవర్లలో 19/1 స్కోరుతో నిలిచింది. క్రీజులోకి వచ్చిన అన్మోల్ ప్రీత్సింగ్ తొలి బంతికే ఫోర్ కొట్టాడు.