ముంబై ఇండియన్స్తో జరుగుతున్న మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ ఓపెనర్ జోస్ బట్లర్ దంచి కొడుతున్నాడు. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన రాజస్థాన్కు మూడో ఓవర్లోనే తొలి దెబ్బ తగిలింది. ఓపెనర్ యశస్వి జైస్వాల్ (1)ను బుమ్రా పెవిలియన్ చేర్చాడు. దీంతో రాజస్థాన్ ఇన్నింగ్స్ తడబడుతుందని అనుకుంటే పొరబడినట్లే.
ఎందుకంటే ఆ తర్వాతే బట్లర్ రెచ్చిపోయాడు. థంపి వేసిన నాలుగో ఓవర్లో ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. వరుసగా 4, 6, 6 , 4, 6 బాదాడు. దీంతో ఆ ఓవర్లో ఏకంగా 26 పరుగులు వచ్చాయి. అయితే ఆ తర్వాత మురుగన్ అశ్విన్ పొదుపుగా బౌలింగ్ చేసి ఐదో ఓవర్లో కేవలం నాలుగు పరుగులే ఇవ్వడంతో ముంబై అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.