ముంబైతో జరుగుతున్న మ్యాచ్లో బెంగళూరు జట్టు లక్ష్యం వైపు స్థిరంగా సాగుతోంది. పవర్ప్లే ముగిసిన వెంటనే కెప్టెన్ డుప్లెసిస్ (16) అవుటైనా యువ ఓపెనర్ అనూజ్ రావత్ (52 నాటౌట్) అర్ధశతకంతో జట్టును ఆదుకున్నాడు. అద్భుతంగా బౌలింగ్ చేసిన అతను రెండు ఫోర్లు, నాలుగు సిక్సర్లతో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అతనికి జత కలిసిన స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ కూడా చక్కని ఇన్నింగ్స్ ఆడుతున్నాడు.
26 బంతుల్లో ఐదు ఫోర్లతో 38 పరుగులు చేశాడీ వెటరన్. వీళ్లిద్దరూ వీలు చిక్కినప్పుడల్లా బంతిని బౌండరీ దాటిస్తూ జట్టును విజయం వైపు తీసుకెళ్తున్నారు. దీంతో 15 ఓవర్లు ముగిసే సరికి బెంగళూరు జట్టు ఒక వికెట్ నష్టానికి 111 పరుగులతో నిలిచింది. ఆర్సీబీ గెలవాలంటే ఇంకా 41 పరుగులు అవసరం ఉంది.
Upping the ante here! 🤜🏻🤛🏻#PlayBold #WeAreChallengers #IPL2022 #Mission2022 #RCB #ನಮ್ಮRCB #MIvRCB pic.twitter.com/gsw8xiMZZY
— Royal Challengers Bangalore (@RCBTweets) April 9, 2022