ముంబైతో జరుగుతున్న మ్యాచ్లో బెంగళూరు జట్టు బ్యాటింగ్ నిదానంగా సాగుతోంది. 152 పరుగుల లక్ష్య ఛేదనను బెంగళూరు జట్టు చాలా నిదానంగా ఆరంభించింది, వారిలో కూడా అనూజ్ రావత్ (20 నాటౌట్), ఫాఫ్ డు ప్లెసిస్ (6 నాటౌట్) నెమ్మదిగా ఆడుతున్నారు. ముఖ్యంగా కెప్లెన్ డుప్లెసిస్ ఆటతీరు టెస్టును తలపిస్తోంది.
ఈ క్రమంలోనే పవర్ప్లే ముగిసే సరికి బెంగళూరు జట్టు వికెట్లేమీ నష్టపోకుండా 30 పరుగులు చేసింది. జయదేవ్ ఉనద్కత్ వేసిన రెండో ఓవర్లోనే రెండు సిక్సులు బాదిన బెంగళూరు బ్యాటర్లు.. ఆ తర్వాత మరే ఓవర్లోనూ భారీ షాట్లు ఆడకుండా ముంబై బౌలర్లు కట్టడి చేశారు.