కోల్కతా నైట్ రైడర్స్తో జరుగుతున్న మ్యాచ్లో ముంబై ఇండియన్స్ జట్టు మరో వికెట్ కోల్పోయింది. ఆండ్రీ రస్సెల్ వేసిన 11వ ఓవర్ మూడో బంతికి యువ ఆటగాడు రమణ్దీప్ సింగ్ (12) పెవిలియన్ చేరాడు. ఫోర్త్ స్టంప్ మీదకు వేసిన లెంగ్త్ బాల్ను మిడ్వికెట్ మీదుగా ఆడటానికి రమణ్దీప్ ప్రయత్నించాడు. ఈ క్రమంలో షార్ట్ థర్డ్ మ్యాన్లో ఉన్న నితీష్ రాణాకు సులభమైన క్యాచ్ ఇచ్చాడు.
దీంతో ముంబై జట్టు మూడో వికెట్ కోల్పోయి కష్టాల్లో పడింది. అయితే క్రీజులో ఇంకా ఓపెనర్ ఇషాన్ కిషన్ ఉన్నాడు. రమణ్దీప్ వెనుతిరగడంతో టిమ్ డేవిడ్ క్రీజులోకి వచ్చాడు. వీళ్లిద్దరూ ధాటిగా ఆడితే ముంబైకి విజయావకాశాలు ఉంటాయి.