గత మ్యాచ్లో టచ్లోకి వచ్చినట్లు కనిపించిన ముంబై ఇండియన్స్ సారధి రోహిత్ శర్మ (2) మరోసారి నిరాశ పరిచాడు. కోల్కతాతో జరుగుతున్న మ్యాచ్లో తొలి ఓవర్లోనే పెవిలియన్ చేరాడు. సౌథీ వేసిన బంతిని డిఫెండ్ చేసుకోవడానికి ప్రయత్నించిన అతను.. బంతిని మిస్ అయ్యాడు. అతని థై ప్యాడ్ను తాకిన బంతి కీపర్ వైపు వెళ్లింది. దాన్ిన కీపర్ జాక్సన్ అందుకొని అప్పీల్ చేశాడు.
అంపైర్ అవుటివ్వకపోవడంతో కోల్కతా రివ్యూ కోరింది. రివ్యూలో బంతికి, బ్యాటుకు మధ్య గ్యాప్ ఉన్నట్లు కనిపించింది. అయితే అల్ట్రా సౌండ్ చెకింగ్లో బంతి బ్యాటుకు సమీపంలోకి వచ్చే సమయానికే స్పైక్ కనిపించింది. అయితే బ్యాటు, బంతి దగ్గరగా ఉన్నప్పుడు వచ్చిన స్పైక్స్ను చూసిన థర్డ్ అంపైర్.. బంతి, బ్యాటును తాకి ఉండొచ్చని అభిప్రాయపడ్డాడు. దీంతో రోహిత్ నిరాశగా మైదానం వీడాడు.