ముంబై ఇండియన్స్తో జరుగుతున్న మ్యాచ్లో కోల్కతా జట్టు నాలుగు వికెట్లు కోల్పోయింది. వెంకటేశ్ అయ్యర్ (43), అజింక్య రహానే (25) శుభారంభం అందించినా కూడా.. వాళ్లిద్దరినీ కుమార కార్తికేయ పెవిలియన్ చేర్చాడు. ఆ తర్వాత కాసేపు నితీష్ రాణా (43) రాణించడంతో ఆ జట్టు భారీ స్కోరు చేసేలా కనిపించింది. అయితే బుమ్రా మరోసారి సత్తా చాటాడు.
రాణాతోపాటు ప్రమాదకరమైన ఆండ్రీ రస్సెల్ (9)ను కూడా పెవిలియన్ చేర్చాడు. కెప్టెన్ శ్రేయాస్ను మురుగన్ అశ్విన్ పెవిలియన్ చేర్చడంతో ఆ జట్టు ఐదు వికెట్లు కోల్పోయింది. ప్రస్తుతం క్రీజులో రింకూ సింగ్, షెల్డాన్ జాక్సన్ ఉన్నారు.