Akash Choudhary : భారత క్రికెట్లో మరో సంచలనం నమోదైంది. మేఘాలయ బ్యాటర్ ఆకాశ్ చౌదరీ (Akash Choudhary) వేగవంతమైన హాఫ్ సెంచరీతో చరిత్ర సృష్టించాడు. దేశవాళీ టోర్నీలో పాపులర్ అయిన రంజీ ట్రోఫీ (Ranji Trophy)లో ఆకాశమే హద్దుగా చెలరేగిన ఆకాశ్ కేవలం 11 బంతుల్లోనే అర్ధ శతకం సాధించాడు. ప్రత్యర్థి బౌలర్లను ఊచకోత కోసిన అతడు.. వరుసగా ఎనిమిది సిక్సర్లు బాదేసి యాభైకి చేరుకోవడం విశేషం. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో అత్యంత వేగవంతమైన హాఫ్ సెంచరీ నమోదు చేసిన అకాశ్ సునామీ ఇన్నింగ్స్ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరలవుతోంది.
దేశవాళీ క్రికెట్లో ప్రతిభావంతులకు కొదవ లేదని చాటాడు మేఘాలయ బ్యాటర్ ఆకాశ్ చౌదరీ. రంజీ ట్రోఫీలో భాగంగా సూరత్లో ఆదివారం అరుణాల్ ప్రదేశ్ (Arunachal Pradesh)తో జరిగిన మ్యాచ్లో ఈ చిచ్చరపిడుగు నమ్మశక్యం కాని ఆటతో రెచ్చిపోయాడు. ఎనిమిదో స్థానంలో క్రీజులోకి వచ్చిన ఆకాశ్ తొలి మూడు బంతుల్లో రెండు పరుగులే తీశాడు. కానీ, నాలుగో బంతిని సిక్సర్గా మలిచి తన విధ్వంసానికి తెరతీశాడు.
🚨 Record Alert 🚨
First player to hit eight consecutive sixes in first-class cricket ✅
Fastest fifty, off just 11 balls, in first-class cricket ✅
Meghalaya’s Akash Kumar etched his name in the record books with a blistering knock of 50*(14) in the Plate Group match against… pic.twitter.com/dJbu8BVhb1
— BCCI Domestic (@BCCIdomestic) November 9, 2025
ఆరుణాచల్ బౌలర్లకు చుక్కలు చూపించిన అతడు ఆ తర్వాతి ఏడు బంతులను స్టాండ్స్లోకి పంపాడు. 11 బంతుల్లోనే ఫిఫ్టీతో లీగ్ చరిత్రలోనే వేగవంతమైన అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడు. తద్వారా దేశవాళీలో వరుసగా ఏడు బంతులకు ఏడు సిక్సర్లు బాదిన తొలి ఆటగాడిగా చరిత్రకెక్కాడు ఆకాశ్. ప్లేట్ గ్రూప్ మ్యాచ్లో సుడిగాలి ఇన్నింగ్స్ ఆడిన ఆకాశ్ ఐపీఎల్ ఫ్రాంచైజీల దృష్టిని ఆకర్షిస్తున్నాడు. ఓపెనర్ అర్పిత్ భటేవరా ద్విశతకం(207), కెప్టెన్ కిషన్ లింగ్దోహ్(119), ఆర్ దలాల్ (144)లు సెంచరీలతో రెచ్చిపోగా.. ఆకాశ్ మెరుపులతో మేఘాలయ తొలి ఇన్నింగ్స్లో 6 వికెట్ల నష్టానికి 628 పరుగులు చేసింది.