మెల్బోర్న్: ఆస్ట్రేలియాలో కరోనా ఆంక్షలు సడలించడంతో డిసెంబర్లో జరుగనున్న ప్రతిష్ఠాత్మక యాషెస్ టెస్టుకు పెద్ద ఎత్తున ప్రేక్షకులను అనుమతిస్తున్నారు. ఇంగ్లండ్- ఆస్ట్రేలియా ఐదు మ్యాచ్ల టెస్టు సిరీస్లో భాగంగా బాక్సింగ్ డే టెస్ట్కు(మూడో మ్యాచ్) 80 వేల మందికి పైగా ప్రేక్షకులు హాజరు కానున్నారు. డిసెంబర్ 26న మొదలయ్యే ఈ బాక్సింగ్ డే టెస్టు మ్యాచ్కు పెద్ద ఎత్తున ప్రేక్షకులు వస్తారని విక్టోరియా ప్రీమియర్ డేనియల్ ఆండ్రూస్ తెలిపాడు. కరోనా తర్వాత ఆస్ట్రేలియాలో జరుగుతున్న అది పెద్ద క్రీడా టోర్నీగా యాషెస్ సిరీస్ నిలువనుంది. ఇందు కోసం అన్ని జాగ్రత్తలు పాటిస్తూ మ్యాచ్లు నిర్వహించేందుకు అక్కడి ప్రభుత్వం అనుమతిచ్చింది. ఈ క్రమంలో మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్లో జాగ్రత్త చర్యలు తీసుకుని ప్రేక్షకులను అనుమతించేందుకు క్రికెట్ ఆస్ట్రేలియా(సీఏ) అంగీకరించింది.