లండన్: వరుస పరాజయాల నేపథ్యం లో ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) దిద్దుబాటు చర్యలు చేపట్టింది. ఇటీవల కెప్టెన్గా ఆ ల్రౌండర్ బెన్స్టోక్స్ను నియమించగా.. తాజాగా టెస్టు జట్టు చీఫ్ కోచ్గా న్యూజిలాండ్ క్రికెట్ దిగ్గజం బ్రెండన్ మెక్కల్లమ్ను నియమించింది. జూన్లో న్యూజిలాండ్తో జరిగే రెండు మ్యాచ్ల టెస్టు సిరీస్కు మెక్కల్లమ్ కోచ్గా బాధ్యతలు తీసుకోనున్నాడు. ఈ మేరకు గురువారం ఈసీబీ ఓ ప్రకటనలో తెలిపింది. 40 ఏండ్ల మెక్కల్లమ్ ప్రస్తుతం ఐపీఎల్లో కోల్కతా నైట్రైడర్స్కు ప్రధాన కోచ్గా సేవలు అందిస్తున్నాడు.