ముంబై: న్యూజిలాండ్తో జరుగుతున్న రెండవ టెస్టులో.. రెండవ రోజు భోజన విరామ సమయానికి ఇండియా ఆరు వికెట్ల నష్టానికి 285 రన్స్ చేసింది. సెంచరీ హీరో మయాంక్ అగర్వాల్ 146 రన్స్తో క్రీజ్లో ఉన్నారు. అక్షర్ పటేల్ 32 రన్స్తో నాటౌట్గా నిలిచాడు. అయితే ఇవాళ కూడా కివీస్ స్పిన్నర్ అజాజ్ పటేల్ సత్తా చాటాడు. నిన్న నాలుగు వికెట్లు తీసుకున్న అజాజ్.. ఇవాళ ఓ ఓవర్లో రెండు వికెట్లు తీసి ఇండియాకు జలక్ ఇచ్చాడు. సాహా, అశ్విన్లు వెంటవెంటనే ఔటయ్యారు. ఆ తర్వాత ఏడో వికెట్కు అగర్వాల్, అక్షర్లు అజేయంగా 61 రన్స్ జోడించారు.