గంగాధర: గోవాలో వచ్చే నెల 1 నుంచి మొదలయ్యే జాతీయస్థాయి సబ్జూనియర్ హాకీ పోటీలకు కరీంనగర్ జిల్లాకు చెందిన గుంటుకు మారుతి ఎంపికయ్యాడు. గంగాధర మండలం గర్శకుర్తి గ్రామ వాసి అయిన మారుతి నిలకడగా రాణిస్తూ వస్తున్నాడు. బరిలోకి దిగిన ప్రతీ టోర్నీలో సత్తాచాటుతూ జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాడు.
ప్రతిభ పరంగా ఎవరికి తీసిపోని మారుతి..ఆర్థిక పరంగా సమస్యలు ఎదుర్కొంటున్న స్థితిని తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ రూ.10వేల ఆర్థిక సాయం చేశారు. ఈ మొత్తాన్ని గురువారం ఎమ్మెల్యే భార్య దీవెన.. మారుతికి అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేకు యువ హాకీ ప్లేయర్ కృతజ్ఞతలు తెలిపాడు.