RR vs LSG : ప్లే ఆఫ్స్ రేసులోని జట్ల అవకాశాల్ని దెబ్బతీస్తున్న లక్నో సూపర్ జెయింట్స్(LSG) ఈసారి రాజస్థాన్ రాయల్స్కు షాకిచ్చేలా ఉంది. జైపూర్లో ఓపెనర్లు మిచెల్ మార్ష్(96), జోష్ ఇంగ్లిస్(60)ల విధ్వంసంతో లక్నో భారీ స్కోర్ కొట్టింది. రాజస్థాన్ బౌలర్లను అలవోకగా ఎదుర్కొన్న ఈ ద్యయం పవర్ ప్లేలోనే స్కోర్ 80 దాటించి గుబులు పుట్టించింది. పూరన్ విఫలమైనా.. ఆఖర్లో కెప్టెన్ పంత్(35) బ్యాట్ ఝులిపించగా రాజస్థాన్కు 221 పరుగుల కఠినమైన సవాల్ విసిరింది లక్నో.
టాస్ ఓడిన లక్నోకు ఓపెనర్లు మిచెల్ మార్ష్(96), జోష్ ఇంగ్లిస్(60)లు మెరుపు ఆరంభాన్నిచ్చారు. జైపూర్ మైదానంలో ప్రేక్షకులను అలరిస్తూ రాజస్థాన్ బౌలర్లను బెంబేలెత్తిస్తూ ఇద్దరూ పోటీపడి బౌండరీలు బాదారు. దాంతో, పవర్ ప్లలోనే స్కోర్ 80 దాటింది. పిడుగుల్లే విరుచుకుపడిన ఇంగ్లిస్ను బౌల్డ్ చేసిన యశ్ రాజ్ ఎట్టకేలకు ఈ జోడీని విడదీసి రాజస్థాన్కు ఉపశనమనమిచ్చాడు.
4️⃣th fifty-plus score in his last 5️⃣ innings 💥
Mitchell Marsh in 𝘂𝗻𝘀𝘁𝗼𝗽𝗽𝗮𝗯𝗹𝗲 𝗺𝗼𝗱𝗲 😎
Updates ▶️ https://t.co/LvQzM3tl06 #TATAIPL | #KhelBindaas | #RRvLSG | @LucknowIPL pic.twitter.com/9X22hmN3VU
— IndianPremierLeague (@IPL) May 19, 2026
ఇంగ్లిస్ ఔటైనా మార్ష్ జోరు తగ్గించలేదు. రాజస్థాన్ పేలవ ఫీల్డింగ్ కూడా కలిసి రావడంతో.. పూరన్(16), కెప్టెన్ రిషభ్ పంత్(35)లతో కీలక భాగస్వామ్యం నెలకొల్పిన మార్ష్ స్కోర్ రెండొందలు దాటించాడు. కానీ, ఆర్చర్ వేసిన ఆఖరి ఓవర్లో మార్ష్, పంత్ రనౌటవ్వగా.. అయుశ్ బదొని(0) బౌల్డయ్యాడు. టపటపా మూడు వికెట్లు పడడంతో లక్నో నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 220 పరుగులు చేసింది.