న్యూఢిల్లీ: భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) అమికస్ క్యూరీగా సీనియర్ న్యాయవాది మణిందర్ సింగ్ను సుప్రీం కోర్టు నియమించింది.
ఆఫీస్ బేరర్ల పదవీ కాలానికి సంబంధించిన రాజ్యాంగ సవరణ చేయాలని బోర్డు దాఖలు చేసిన పిటిషన్పై ఈ నెల 28న విచారణ చేపడతామని చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ కృష్ణ మురళి, జస్టిస్ హిమా కోహ్లీతో కూడిన ధర్మాసనం గురువారం ప్రకటించింది.