బెంగళూరు: యువ అథ్లెట్ మణికంఠ 100 మీటర్ల పరుగులో జాతీయ రికార్డు బద్దలు కొట్టాడు. జాతీయ ఓపెన్ అథ్లెటిక్స్ చాంపియన్షిప్ హీట్స్లో మణికంఠ 10.23 సెకన్లలో లక్ష్యాన్ని చేరాడు. పురుషుల వంద మీటర్ల పరుగులో మన దేశం తరఫున ఇదే అత్యుత్తమ ప్రదర్శన కాగా.. 2016లో ఒడిశాకు చెందిన అమియ కుమార్ మాలిక్ (10.26 సెకన్లు) నెలకొల్పిన రికార్డును బుధవారం మణికంఠ బద్దలు కొట్టాడు. ఈ ప్రదర్శనతో 21 ఏండ్ల మణికంఠ అథ్లెటిక్స్ చాంపియన్షిప్ ఫైనల్కు అర్హత సాధించాడు.