రాజ్కోట్: భారత మహిళా క్రికెటర్ స్మృతి మంధాన (Smriti Mandhana).. వన్డే క్రికెట్లో అరుదైన రికార్డును నమోదు చేసింది. ఐర్లాండ్తో జరుగుతున్న మూడవ వన్డేలో ఫాస్టెస్ట్ సెంచరీ నమోదు చేసింది. 70 బంతుల్లోనే ఆమె శతకాన్ని సాధించింది. దీంతో అత్యంత వేగంగా సెంచరీ మైలురాయిని అందుకున్న భారతీయ మహిళా క్రికెటర్గా మంథాన రికార్డు క్రియేట్ చేసింది. స్మృతి మంథాన ఇన్నింగ్స్లో 12 బౌండరీలు, ఏడు సిక్సర్లు ఉన్నాయి.
Innings Break!
A 𝗥𝗲𝗰𝗼𝗿𝗱-𝗕𝗿𝗲𝗮𝗸𝗶𝗻𝗴 batting display from #TeamIndia in Rajkot! 🙌 🙌
Hundreds for Pratika Rawal & captain Smriti Mandhana 👏
Target 🎯 for Ireland – 436
Updates ▶️ https://t.co/xOe6thhPiL#INDvIRE | @IDFCFIRSTBank pic.twitter.com/aid00lGDjY
— BCCI Women (@BCCIWomen) January 15, 2025
రాజ్కోట్లో జరుగుతున్న మ్యాచ్లో స్మృతి 135 రన్స్ చేసి ఔటైంది. తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత మహిళల క్రికెట్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 435 రన్స్ చేసింది. ఓపెనర్ స్మృతి మంధానతో పాటు మరో ఓపెనర్ ప్రతీకా రావల్ కూడా సెంచరీ కొట్టింది. ప్రతీకా రావల్ 129 బంతుల్లో 20 ఫోర్లు, ఓ సిక్సర్ సాయంతో 154 రన్స్ చేసి ఔటైంది. మంధాన, ప్రతీక తొలి వికెట్కు 233 రన్స్ జోడించారు. భారత మహిళల జట్టు 435 రన్స్ చేసి .. వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన రికార్డును నమోదు చేసింది.
That Maiden ODI Hundred Feeling 🤗
Updates ▶️ https://t.co/xOe6thhPiL#TeamIndia | #INDvIRE | @IDFCFIRSTBank pic.twitter.com/GgwPOGL3Uk
— BCCI Women (@BCCIWomen) January 15, 2025