హైదరాబాద్, ఆట ప్రతినిధి: యూటీటీ జాతీయ ర్యాంకింగ్ టీటీ చాంపియన్షిప్లో మానవ్ థక్కర్, ఐహిక ముఖర్జీ టైటిల్ విజేతలుగా నిలిచారు.
శుక్రవారం జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్లో మానవ్ థక్కర్ 5-11, 13-11, 8-11, 11-3, 11-4, 12-10తో స్నేహిత్(తెలంగాణ)పై విజయం సాధించాడు. మహిళల సింగిల్స్లో ఐహిక ముఖర్జీ టైటిల్ దక్కించుకుంది.