కొలంబో: పేస్ దిగ్గజం లసిత్ మలింగ.. శ్రీలంక బౌలింగ్ స్ట్రాటజీ కోచ్గా ఎంపికయ్యాడు. వచ్చే వారం నుంచి ఆస్ట్రేలియాతో జరుగనున్న సిరీస్ కోసం లంక బోర్డు మలింగను నియమించింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన పరిమిత ఓవర్ల సిరీస్కు కూడా మలింగా స్ట్రాటజీ కోచ్గా వ్యవహరించిన విషయం తెలిసిందే. ‘ఆసీస్తో సిరీస్లో మలింగ బౌలర్లకు సూచనలివ్వనున్నాడు. అంతర్జాతీయ క్రికెట్లో అపార అనుభవం ఉన్న మలింగ సలహాలు యువ బౌలర్లకు ఎంతగానో ఉపయోగపడతాయి’ అని లంక బోర్డు శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొంది. ఈ పర్యటనలో భాగంగా ఆసీస్ జట్టు లంకతో ఐదు వన్డేలు, 3 టీ20లు ఆడనుంది. గతేడాది అన్ని ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటించిన మలింగ.. తాజాగా ముగిసిన ఐపీఎల్లో రాజస్థాన్ రాయల్స్ బౌలింగ్ కోచ్గా వ్యవహరించాడు.