ముంబై : ఇండియన్ ప్రీమియర్ లీగ్పై చెరగని ముద్ర వేసిన శ్రీలంక మాజీ పేసర్ లసిత్ మలింగ సొంత గూటికి చేరాడు. ఈ వెటరన్ బౌలర్ ముంబై ఇండియన్స్ బౌలింగ్ కోచ్గా నియమితులయ్యాడు. న్యూజిలాండ్ దిగ్గజం షేన్ బాండ్ పదవీకాలం ముగియడంతో.. మలింగకు బాధ్యతలు అప్పగిస్తున్నట్టు శుక్రవారం ముంబై ఫ్రాంఛైజీ అధికారికంగా ప్రకటించింది. రోహిత్ సేన నాలుగు ఐపీఎల్ ట్రోఫీలు నెగ్గడంలో కీలక పాత్ర పోషించిన మలింగ.. 17వ సీజన్లో మార్క్ బౌచర్, కీరన్ పోలార్డ్లతో కూడిన కోచింగ్ బృందంతో కలిసి పనిచేయనున్నాడు. మార్క్, పోలీ, రోహిత్, జట్టు సభ్యులతో కలిసి పనిచేసేందుకు ఆతృతగా ఎదురుచూస్తున్నా. ముఖ్యంగా..16వ సీజన్లో ముంబై బౌలింగ్ యూనిట్ వ్యూహాలు నాకెంతో నచ్చాయి. యువకులతో నిండిన ముంబైకి త్వరితగతిన పుంజుకోగల సత్తా ఉంది అని మలింగ పేర్కొన్నాడు. 40 ఏండ్ల మలింగకు ముంబైతో 13 ఏళ్ల అనుబంధం ఉంది. 2008 నుంచి 11 సీజన్లు ప్లేయర్గా కొనసాగిన లలిత్.. 2018లో ముంబైకి బౌలింగ్ మెంటార్గా సేవలందించాడు. అనంతరం రాజస్థాన్ రాయల్స్ జట్టుకు 2022 -2023లో ఫాస్ట్ బౌలింగ్ కోచ్గా వ్యవహరించిన విషయం తెలిసిందే.