Malaysia Open 2024: భారత స్టార్ షట్లర్ హెచ్ఎస్ ప్రణయ్ కొత్త ఏడాదిని ఓటమితో ప్రారంభించాడు. కౌలాలాంపూర్ వేదికగా జరుగుతున్న మలేషియా ఓపెన్ – 2024లో ప్రణయ్.. తొలి రౌండ్లోనే వెనుదిరిగాడు. ప్రపంచ 8వ ర్యాంకర్ అయిన ప్రణయ్.. బుధవారం జరిగిన పురుషుల సింగిల్స్లో 14-21, 11-21 తేడాతో డెన్మార్క్ ప్లేయర్ అండర్ అంటోన్సెన్ చేతిలో ఓటమి పాలయ్యాడు. రెండు సెట్లలోనూ తేలిపోయిన ప్రణయ్.. ఏ మాత్రం ప్రతిఘటన లేకుండానే ప్రత్యర్థికి మ్యాచ్ను అప్పగించాడు.
అసలే ఈ ఏడాది పారిస్ ఒలింపిక్స్ ఉన్న నేపథ్యంలో కొత్త ఏడాదిని ప్రణయ్ ఓటమితో ఆరంభించడం అతడిని నిరాశపరిచేదే. అంటోన్సెన్తో మ్యాచ్లో తొలి సెట్లో తేలిపోయిన ప్రణయ్.. రెండో సెట్ ఆరంభంలో కొంత పోరాడాడు. ఒకదశలో 7-7తో సమంగా ఉన్నా తర్వాత మళ్లీ లయ కోల్పోయి గేమ్తో పాటు మ్యాచ్ కూడా కోల్పోయాడు.
🏸😞 Earlier, HS Prannoy faced a straight-set defeat against Anders Antonsen, 21-14, 21-11, in the first round.@BadmintonJust @BAI_Media @Media_SAI @PRANNOYHSPRI
📸 Pics belong to the respective owners • #HSPrannoy #MalaysiaOpen2024 #MalaysiaOpenSuper1000 https://t.co/IbV6Nh8v9w pic.twitter.com/gADMrIJofq
— Sportwalk Media (@sportwalkmedia) January 10, 2024
ఇదే టోర్నీలో భారత డబుల్స్ ప్లేయర్లు సాత్విక్ సాయిరాజ్ – చిరాగ్ శెట్టిల ద్వయం 21-18, 21-15 తేడాతో ఇండోనేషియాకు చెందిన ఎంఎస్ ఫిక్రి-మౌలానాను ఓడించారు. ఈ పోటీలలో భారత్ నుంచి లక్ష్య సేన్ నేటి సాయంత్రం సింగిల్స్ ఈవెంట్లో చైనాకు చెందిన వెంగ్తో పోటీ సిద్ధమవుతున్నాడు. మంగళవారం కిదాంబి శ్రీకాంత్.. తొలి రౌండ్లో గెలిచి రెండో రౌండ్కు అర్హత సాధించిన విషయం తెలిసిందే.