కౌలాలంపూర్: ప్రతిష్టాత్మక పారిస్ ఒలింపిక్స్కు ముందు మలేషియా మాస్టర్స్ బ్యాడ్మింటన్ టైటిల్ గెలిచి ఆత్మవిశ్వాసంతో విశ్వక్రీడల్లోకి వెళ్లాలనుకున్న స్టార్ షట్లర్ పీవీ సింధుకు నిరాశే ఎదురైంది. సుమారు ఏడాదికాలం తర్వాత ఓ టోర్నీ ఫైనల్ చేరిన ఆమె కౌలాలంపూర్ వేదికగా ఆదివారం జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్ పోరులో 21-16, 5-21, 16-21 తేడాతో చైనా అమ్మాయి వాంగ్ జి యి చేతిలో పరాభవం పాలైంది.
79 నిమిషాల పాటు సాగిన ఈ మ్యాచ్లో తొలి రౌండ్ను గెలుచుకున్నా తర్వాత తడబడిన సింధు.. వరుసగా రెండు రౌండ్లలోనూ ఓడి ఓటమివైపున నిలిచింది. 2022 లో సింగపూర్ ఓపెన్ టైటిల్ గెలిచిన తర్వాత సింధు మళ్లీ.. ‘బ్యాడ్మింటన్ సూపర్’ టోర్నీలలో విజేతగా నిలవలేదు. 2023 మ్యాడ్రిడ్ ఓపెన్ తర్వాత ఫైనల్కు చేరిన సింధు.. మరోసారి రన్నరప్తోనే సరిపెట్టుకుంది.