హైదరాబాద్, డిసెంబర్ 2 (నమస్తే తెలంగాణ): తెలంగాణకు చెందిన ప్రముఖ పర్వతారోహకురాలు మాలావత్ పూర్ణ భవిష్యత్ ప్రయత్నాలకు ప్రభుత్వం అన్నివిధాలుగా సహాయం అందిస్తుందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కే తారకరామారావు భరోసా ఇచ్చారు. గురువారం ప్రగతిభవన్లో మంత్రి కేటీఆర్ను పూర్ణ కలిశారు. ఈ సందర్భంగా తన జీవితంపై ప్రచురించిన ‘పూర్ణ’ పుస్తకాన్ని ఆమె కేటీఆర్కు అందజేశారు. ఈ సందర్భంగా ఆమె భవిష్యత్ ప్రణాళికల గురించి అడిగి తెలుసుకున్నారు. తనను ప్రోత్సహిస్తున్న మంత్రి కేటీఆర్కు పూర్ణ ధన్యవాదాలు తెలిపారు