Mahesh Bhupathi | ముంబై: అల్టిమేట్ టేబుల్ టెన్నిస్(యూటీటీ)లో భారత టెన్నిస్ దిగ్గజం మహేశ్ భూపతి రంగప్రవేశం చేశాడు. రానున్న సీజన్లో అహ్మదాబాద్ ఎస్జీ పైపర్స్ జట్టు ద్వారా లీగ్లో భూపతి అరంగేట్రం చేయబోతున్నాడు. జైపూర్ ప్యాట్రియాట్స్తో పాటు అహ్మదాబాద్ టీమ్ యూటీటీలో కొత్త జట్లుగా బరిలోకి దిగబోతున్నాయి. జాతీయ టేబుల్ టెన్నిస్ ఫెడరేషన్(టీటీఎఫ్ఐ) ఆధ్వర్యంలో నీరజ్ బజాజ్, వితా దానీ యూటీటీ లీగ్ను నిర్వహిస్తున్నారు. ఇప్పటికే లీగ్లో చెన్నై, ఢిల్లీ, గోవా, పుణెరీ, యూ ముంబా జట్లు పోటీలో ఉన్నాయి.