జైపూర్: లక్నో సూపర్ జెయింట్స్ (ఎల్ఎస్జీ) కెప్టెన్ కేఎల్ రాహుల్ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. రాజస్థాన్ రాయల్స్తో బుధవారం జరిగిన మ్యాచ్లో స్లో ఓవర్రేట్కు పాల్పడినందుకు రాహుల్కు రూ.12 లక్షల జరిమానా విధించారు. ఐపీఎల్ నియమ నిబంధనల ప్రకారం సీజన్లో తొలిసారి తప్పు చేసినందుకు ఈ జరిమానా వేసినట్లు ఐపీఎల్ ఒక ప్రకటనలో పేర్కొంది.
లీగ్ నిబంధనలు అనుసరించి మ్యాచ్ను మూడు గంటల 20 నిమిషాల్లో ముగించాలి. కానీ కొన్ని సందర్భాల్లో మ్యాచ్ నాలుగు గంటల పాటు సాగుతున్నది. ఈ నేపథ్యంలో ఐపీఎల్ యజమాన్యం ఆయా జట్ల కెప్టెన్లపై ఫైన్ వేస్తున్నది. రాయల్స్తో జరిగిన లో స్కోరింగ్ పోరులో లక్నో ఉత్కంఠ విజయం సాధించిన సంగతి తెలిసిందే.