లక్నో: భారత మాజీ ఆటగాడు, సెలెక్షన్ కమిటీ చైర్మన్ ఎమ్మెస్కే ప్రసాద్.. ఐపీఎల్లో లక్నో జట్టు స్ట్రాటజిక్ కన్సల్టెంట్గా నియమితుడయ్యాడు. ఈ మేరకు గురువారం లక్నో సూపర్ జెయింట్స్ యాజమాన్యం ఒక ప్రకటన విడుదల చేసింది. ‘ప్రసాద్ అనుభవం, ఆటపై అతడికి ఉన్న మక్కువ మాకు ఎంతో ఉపయోగపడతాయి’ అని పేర్కొంది. స్ట్రాటజిక్ కన్సల్టెంట్గా ప్రతిభావంతులను గుర్తించడంతో పాటు..
వారిలో నైపుణ్యాలను మెరుగుపరచడం వంటి బాధ్యతలు ఇకపై ప్రసాద్ చూసుకోనున్నాడు. అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించిన అనంతరం ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ డైరెక్టర్గా సేవలందించిన ఎమ్మెస్కే.. 2016 నుంచి 2020 వరకు భారత చీఫ్ సెలెక్టర్గా కొనసాగిన విషయం తెలిసిందే. టీమ్ఇండియా తరఫున వికెట్ కీపర్ బ్యాటర్గా 6 టెస్టులు, 17 వన్డేలు ఆడిన ఎమ్మెస్కే.. ప్రస్తుతం కామెంటేటర్గా వ్యవహరిస్తున్నాడు.