లక్నోతో జరుగుతున్న మ్యాచ్లో రాజస్థాన్ జట్టు ధాటిగా ఆడుతోంది. స్టార్ ఓపెనర్ జాస్ బట్లర్ (2) స్వల్ప స్కోరుకే పెవిలియన్ చేరినా.. మరో ఓపెనర్ యశస్వి జైస్వాల్ (34 నాటౌట్) ధాటిగా ఆడుతున్నాడు. అతనికి కెప్టెన్ సంజూ శాంసన్ నుంచి మంచి సహకారం అందింది. దాంతో పవర్ప్లే ముగిసే సరికి రాజస్థాన్ జట్టు ఒక వికెట్ నష్టానికి 51 పరుగులు చేసింది.
బట్లర్ అవుటైనా జైస్వాల్ భారీ షాట్లతో విరుచుకుపడ్డాడు. శాంసన్ కూడా అవకాశం దొరికినప్పుడల్లా బౌండరీలు బాదడంతో రాజస్థాన్ మంచి స్కోరు చేసింది.