లక్నోతో జరుగుతున్న మ్యాచ్లో రాజస్థాన్ జట్టు నాలుగో వికెట్ కోల్పోయింది. అద్భుతంగా ఆడిన యువ ఆటగాడు దేవదత్ పడిక్కల్ (39)ను రవి బిష్ణోయి అవుట్ చేశాడు. 14వ ఓవర్లో బిష్ణోయి వేసిన బంతిని భారీ షాట్ ఆడేందుకు ప్రయత్నించిన పడిక్కల్.. డీప్ మిడ్వికెట్లో పాండ్యాకు చిక్కాడు.
బిష్ణోయి గూగ్లీ వేయడంతో పడిక్కల్ బోల్తా కొట్టాడు. ఎడ్జ్ తీసుకొని ఫ్లాట్గా గాల్లోకి లేచిన బంతిని కృనాల్ ఎలాంటి పొరపాటు చేయకుండా పట్టేశాడు. దాంతో 14 ఓవర్లు ముగిసే సరికి రాజస్థాన్ జట్టు 4 వికెట్ల నష్టానికి 123 పరుగులు చేసింది.