రాజస్థాన్తో జరుగుతున్న మ్యాచ్లో లక్నో మరో వికెట్ కోల్పోయింది. ఇన్నింగ్స్ నిలబెట్టడానికి కష్టపడిన కృనాల పాండ్యా (25) భారీ షాట్కు ప్రయత్నించి అవుటయ్యాడు. అశ్విన్ వేసిన 14వ ఓవర్ తొలి బంతిన లాంగాన్లో సిక్సర్ కొట్టడానికి కృనాల్ ప్రయత్నించాడు. అయితే వేగంగా అక్కడకు చేరుకున్న జోస్ బట్లర్.. క్యాచ్ అందుకున్నాడు.
కానీ బ్యాలెన్స్ నిలుపుకోలేక బౌండరీ రోప్ దాటేశాడు. చివరి నిమిషంలో తన చేతిలోని బంతిని పరాగ్ వైపు విసిరాడు. పరాగ్ దాన్ని చటుక్కున పట్టేయడంతో కృనాల్ మైదానం వీడాడు. దీంతో 94 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయిన లక్నో.. ఇబ్బందుల్లో పడింది.