రాజస్థాన్తో జరుగుతున్న మ్యాచ్లో లక్నో జట్టు తడబడుతోంది. పవర్ప్లే ముగిసేలోపే కీలకమైన వికెట్లు కోల్పోయింది. క్వింటన్ డీకాక్ (7), ఆయుష్ బదోని (0) ఇద్దర్నీ ట్రెంట్ బౌల్ట్ ఒకే ఓవర్లో పెవిలియన్ చేర్చాడు. ఆ తర్వాత ఆరో ఓవర్లో తొలి బంతికే భారీ సిక్సర్ బాదిన రాహుల్ (10).. మూడో బంతికి అవుటయ్యాడు.
ప్రసిద్ధ్ కృష్ణ వేసిన షార్ట్ బాల్ను బాదిన అతను.. పాయింట్లో జైస్వాల్కు చిక్కాడు. పాయింట్ మీదుగా బంతిని బౌండరీకి తరలించడానికి ప్రయత్నించిన రాహుల్ విఫలమయ్యాడు. దీంతో పవర్ప్లే ముగిసే సరికి రాజస్థాన్ జట్టు మూడు వికెట్ల నష్టానికి 34 పరుగులు చేసింది.