లక్నో సూపర్ జెయింట్స్తో జరుగుతున్నమ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ బ్యాటింగ్ తడబడింది. ఆరంభంలోనే జోస్ బట్లర్ (2) అవుటైనా.. మరో ఓపెనర్ యశస్వి జైస్వాల్ (41), సంజూ శాంసన్ (32), పడిక్కల్ (39) రాణించారు. దాంతో భారీ స్కోరు చేసేలా కనిపించిన రాజస్థాన్ను రవి బిష్ణోయి, బదోనీ దెబ్బ కొట్టారు. ఆ తర్వాత వచ్చిన రియాన్ పరాగ్ (19), జేమ్స్ నీషమ్ (19) భారీ షాట్లు ఆడలేకపోయారు.
చివర్లో బౌల్ట్ (17 నాటౌట్), అశ్విన్ (10 నాటౌట్) కలిసి మూడు ఫోర్లు బాదడంతో నిర్ణీత 20 ఓవర్లు ముగిసే సరికి రాజస్థాన్ జట్టు 6 వికెట్ల నష్టానికి 178 పరుగులు చేసింది. లక్నో బౌలర్లలో బిష్ణోయి రెండు వికెట్లతో సత్తా చాటగా.. హోల్డర్, బదోని, ఆవేష్ ఖాన్ తలో వికెట్ తీసుకున్నారు.