బెంగళూరుతో జరుగుతున్న మ్యాచ్లో లక్నో జట్టు పోరాడుతోంది. ఆంరంభంలోనే డీకాక్ (3), మనీష్ పాండే (6) వికెట్లు కోల్పోయిన లక్నోను.. కేఎల్ రాహుల్ (30), కృనాల్ పాండ్య (42) ఆదుకున్నారు. రాహుల్ అవుటైన తర్వాత జట్టును ముందుండి నడిపించిన పాండ్యకు కాసేపు దీపక్ హుడా (13) నుంచి సహకారం అందింది. అయితే సిరాజ్ బౌలింగ్లో హుడా అవుటయ్యాడు. ఆ తర్వాత కాసేపటికే మ్యాక్స్వెల్ బౌలింగ్లో పాండ్య కూడా బోల్తా కొట్టాడు.
షాబాజ్ అహ్మద్కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. ప్రస్తుతం క్రీజులో ఆయుష్ బదోని (10 నాటౌట్), మార్కస్ స్టొయినిస్ (2 నాటౌట్) ఉన్నారు. వీరిపైనే లక్నో విజయావకాశాలు ఆధారపడి ఉన్నాయనడంలో సందేహం లేదు. ఈ క్రమంలోనే పదిహేను ఓవర్లు ముగిసే సరికి లక్నో జట్టు ఐదు వికెట్ల నష్టానికి 117 పరుగులు చేసింది. విజయం కోసం ఆ జట్టు 30 బంతుల్లో మరో 65 పరుగులు చేయాల్సి ఉంది.