ఐపీఎల్ ప్లేఆఫ్స్కు సర్వం సిద్ధమైంది. తొలి క్వాలిఫైయర్లో కొత్త జట్టు గుజరాత్ అద్భుతమైన ఆటతీరుతో ఫైనల్ చేరింది. ఆ మ్యాచ్లో ఓడిన రాజస్థాన్ రాయల్స్.. రెండో క్వాలిఫైయర్ ఆడాల్సి ఉంది. ఈ మ్యాచ్లో ఆడే జట్టు ఏదో నేడు జరిగే ఎలిమినేటర్లో తేలాల్సి ఉంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, లక్నో సూపర్ జెయింట్స్ మధ్య జరిగే ఈ మ్యాచ్కు వర్షం అంతరాయం కలిగించింది.
వర్షం పడే సూచనలు పెద్దగా లేవని అంతా భావించినా.. కనీసం టాస్ కూడా వేయకముందే వర్షం రావడంతో క్రికెట్ అభిమానులు టెన్షన్ పడిపోతున్నారు. వర్షానికి తోడు భయంకరంగా గాలులు వీస్తుండటంతో మ్యాచ్ జరగడంపై అభిమానులు ఆందోళన చెందుతున్నారు.
ఐపీఎల్ నిబంధనల ప్రకారం చూసుకుంటే.. రాత్రి 9.40లోపు వర్షం ఆగిపోతే.. పూర్తి మ్యాచ్ జరుగుతుంది. ఒక వేళ రాత్రి 11.56 గంటల వరకు వర్షం ఆగలేదనుకోండి.. ఆ తర్వాత ఐదు ఓవర్ల మ్యాచ్ నిర్వహిస్తారు. అది కూడా కుదరకపోతే సూపర్ ఓవర్ ద్వారా విజేతను నిర్ణయిస్తారు. సూపర్ ఓవర్ వేయడానికి కూడా కుదరలేదంటే.. లీగ్ దశలో ఎక్కువ విజయాలు ఉన్న లక్నో జట్టును విజేతగా ప్రకటిస్తారు.
🚨 Update from the Eden Gardens 🚨
It has started to rain 🌧️ in Kolkata and the toss is delayed!
Follow the match ▶️ https://t.co/cOuFDWIUmk #TATAIPL | #LSGvRCB pic.twitter.com/W7dlpdeogK
— IndianPremierLeague (@IPL) May 25, 2022