లక్నోతో జరుగుతున్న మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) సారధి ఫాఫ్ డుప్లెసిస్ (96) సెంచరీ మిస్ చేసుకున్నాడు. తొలి ఓవర్లోనే అనూజ్ రావత్ (4), కోహ్లీ (0) వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన ఆ జట్టును.. మ్యాక్స్వెల్ (23)తో కలిసి డుప్లెసిస్ ఆదుకున్నాడు. ఆ తర్వాత సూయష్ ప్రభుదేశాయి (10) విఫలమైనా షాబాజ్ అహ్మద్ (26) కలిసి మరోసారి ఇన్నింగ్స్ నిర్మించాడు.
ఇద్దరూ కలిసి 50 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన తర్వాత సమన్వయ లోపంతో షాబాజ్ రనౌట్ అయ్యాడు. చివర్లో వచ్చిన దినేష్ కార్తీక్ (13 నాటౌట్)కు ఎక్కువ బంతులు ఎదుర్కొనే అవకాశం రాలేదు. చివరి ఓవర్ ఐదో బంతికి హోల్డర్ బౌలింగ్లో స్టొయినిస్కు క్యాచ్ ఇచ్చిన డుప్లెసిస్.. తన ఐపీఎల్ టాప్ స్కోర్ 96 వద్దే మరోసారి వికెట్ పారేసుకున్నాడు.
దీంతో నిర్ణీత 20 ఓవర్లు ముగిసే సరికి బెంగళూరు జట్టు 6 వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసింది. లక్నో బౌలర్లలో చమీర, హోల్డర్ చెరో రెండు వికెట్లు తీసుకోగా.. కృనాల్ పాండ్యా ఒక వికెట్ తన ఖాతాలో వేసుకున్నాడు.
A competitive total on the board. 👊🏻
Time for our bowlers to step up! 🙌🏻#PlayBold #WeAreChallengers #IPL2022 #Mission2022 #RCB #ನಮ್ಮRCB #LSGvRCB pic.twitter.com/fMArPDZnIG
— Royal Challengers Bangalore (@RCBTweets) April 19, 2022