బెంగళూరు జట్టు మరో కీలక వికెట్ కోల్పోయింది. జేసన్ హోల్డర్ వేసిన ఎనిమిదవ ఓవర్ రెండో బంతికే యువ ఆటగాడు సూయష్ ప్రభుదేశాయి (10) అవుటయ్యాడు. హోల్డర్ వేసిన స్లో బంతిని సరిగా అంచనా వేయలేకపోయిన ప్రభుదేశాయి.. బంతిని గాల్లోకి లేపాడు. దాన్ని షార్ట్ మిడ్ వికెట్లో ఫీల్డింగ్ చేస్తున్న కృనాల్ పాండ్యా సులభంగా అందుకున్నాడు.
దాంతో ప్రభుదేశాయి ఇన్నింగ్స్ ముగిసింది. ఈ వికెట్తో బెంగళూరు జట్టు నాలుగు కీలక వికెట్లు కోల్పోయిందని అభిమానులు టెన్షన్ పడుతున్నారు. ప్రస్తుతం క్రీజులో షాబాజ్ అహ్మద్, డుప్లెసిస్ ఉన్నారు. ఎనిమిది ఓవర్లు ముగిసే సరికి బెంగళూరు జట్టు నాలుగు వికెట్ల నష్టానికి 65 పరుగులు చేసింది.