లక్నోతో జరుగుతున్న మ్యాచ్లో గుజరాత్ టైటన్స్కు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. ఫామ్లో ఉన్న ఓపెనర్ వృద్ధిమాన్ సాహా (5) మూడో ఓవర్లోనే పెవిలియన్ చేరగా.. మరో కీలక ఆటగాడు మాథ్యూ వేడ్ (10) కూడా ఎక్కువసేపు క్రీజులో నిలవలేదు. ఆవేష్ ఖాన్ వేసిన బంతిని లెగ్ సైడ్ ఆడేందుకు ముందుకొచ్చిన వేడ్.. కీపర్కు సులభమైన క్యాచ్ ఇచ్చాడు.
దాంతో వేడ్ నిరాశగా మైదానం వీడాడు. అదే ఓవర్ చివరి బంతికి మరో ఓపెనర్ శుభ్మన్ గిల్ కూడా రనౌట్ అయ్యే అవకాశం వచ్చింది. అయితే ఫీల్డింగ్ చేసిన బదోనీ.. బంతిని కీపర్కు సరిగా విసరక పోవడంతో గిల్ బతికిపోయాడు. దీంతో కెప్టెన్ హార్దిక్ పాండ్యా క్రీజులోకి వచ్చాడు. పవర్ప్లే ముగిసే సరికి గుజరాత్ జట్టు రెండు వికెట్ల నష్టానికి 35 పరుగులు చేసింది.