లక్నోతో జరుగుతున్న మ్యాచ్లో గుజరాత్ జట్టు ఇబ్బందుల్లో పడింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆ జట్టుకు శుభారంభం దక్కలేదు. సాహా (5), వేడ్ (10) స్వల్పస్కోర్లకే పెవిలియన్ చేరారు. ఇలాంటి సమయంలో క్రీజులోకి వచ్చిన కెప్టెన్ హార్దిక్ పాండ్యా (13) కూడా జట్టును ఆదుకోలేకపోయాడు.
ఆవేష్ ఖాన్ ఆఫ్ సైడ్ వేసిన షార్ట్ బాల్ను ఆడటానికి ప్రయత్నించిన హార్దిక్.. సరిగా ఆడలేకపోయాడు. దీంతో ఎడ్జ్ తీసుకున్న బంతి.. కీపర్ డీకాక్ చేతుల్లో పడింది. దీంతో హార్దిక్ పెవిలియన్ చేరాడు. పది ఓవర్లు ముగిసే సరికి గుజరాత్ జట్టు మూడు వికెట్ల నష్టానికి 59 పరుగులు మాత్రమే చేయగలిగింది.