లక్నోతో జరుగుతున్న మ్యాచ్లో గుజరాత్ బ్యాటింగ్ విభాగం పూర్తిగా విఫలమైంది. ఒక్క శుభ్మన్ గిల్ (50 నాటౌట్) ఒక్కడే ఒంటరి పోరాటం చేస్తున్నాడు. అతను అర్థశతకం బాదినా.. అవతలి ఎండ్ నుంచి సహకారం లభించలేదు. కాసేపు క్రీజులో నిలిచిన డేవిడ్ మిల్లర్ (26) కూడా పెవిలియన్ చేరాడు.
జేసన్ హోల్డర్ ఆఫ్ స్టంప్ ఆవల వేసిన షార్ట్ బాల్ను ఆడిన మిల్లర్.. డీప్ థర్డ్ మ్యాన్ వద్ద ఉన్న బదోనీకి సులభమైన క్యాచ్ ఇచ్చి మైదానం వీడాడు. దీంతో 103 పరుగుల వద్ద గుజరాత్ జట్టు నాలుగో వికెట్ కోల్పోయింది. ప్రస్తుతం గిల్తోపాటు తెవాటియా క్రీజులో ఉన్నాడు.