ఐపీఎల్లో కొత్త జట్ల మధ్య సమరం ఆసక్తికరంగా మొదలైంది. మ్యాచ్ మొదటి బంతికే లక్నో కెప్టెన్ కేఎల్ రాహుల్ (0) గోల్డెన్ డక్గా వెనుతిరిగాడు. ఆ తర్వాత క్వింటన్ డీ కాక్ (7), ఎవిన్ లూయిస్ (10), మనీష్ పాండే (6) వరుసగా పెవిలియన్కు క్యూ కట్టారు. దీంతో లక్నో సూపర్ జెయింట్స్ జట్టు 29 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి కనీసం వంద పరుగులైనా చేస్తుందా? అనిపించింది.
అయితే దీపక్ హుడా (55), ఆయుష్ బదోనీ (54) ఇద్దరూ ఆ జట్టును ఆదుకున్నారు. మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడిన వీళ్లిద్దరూ.. ఆ తర్వాత బ్యాట్ ఝుళిపించారు. హుడా వెనుతిరగడంతో క్రీజులోకి వచ్చిన కృనాల్ పాండ్యా (13 బంతుల్లో 21) కూడా వేగంగా ఆడటంతో లక్నో జట్టు 20 ఓవర్లు ముగిసే సరికి 158/6 స్కోరు చేసింది.
గుజరాత్ ముందు పోరాడగలిగే టార్గెట్ నిలిపింది. గుజరాత్ బౌలర్లలో మహమ్మద్ షమీ 3 వికెట్లతో చెలరేగగా.. వరుణ్ ఆరోన్ 2, రషీద్ ఖాన్ ఒక వికెట్ తీసుకున్నారు.
#LucknowSuperGiants have posted 158 on the board. Is it enough against #GujaratTitans? 🔥#IPL2022 #IPL #GTvsLSG #LSG #GT pic.twitter.com/qRL1MqoFXj
— myKhel.com (@mykhelcom) March 28, 2022