టోక్యో ఒలింపిక్స్లో కాంస్య పతకం సాధించి భారత కీర్తి పతాకను ఎగరేసిన బాక్సర్ లవ్లీనా బోర్గోహైన్. ఆమెకు 2018లోనే నబనీత్ గోస్వామితో వివాహమైంది. అయితే వీళ్లిద్దరూ విడాకులకు అప్లై చేశారంటూ ఇటీవల కొన్ని వార్తలు వచ్చాయి. వీటిపై వివరణ ఇచ్చేందుకు ఆమె తన ఫేస్బుక్ ఖాతాలో ఒక వీడియో పోస్టు చేసింది.
ఈ వీడియోలో తన విడాకుల వార్తలపై వివరణ ఇచ్చిన ఆమె.. భర్తతో కలిసి ఇద్దరికీ ఒకరిపట్ల ఒకరికి అలీజియన్స్ కోసం రాతపూర్వక ఒప్పందం చేసుకున్నట్లు వెల్లడించింది. తామిద్దరం ఎప్పుడూ భార్యాభర్తల్లా జీవించలేదని, మంచి స్నేహితుల్లాగే ఉన్నామని తెలిపింది. అలాగే మీడియా సంస్థలు ఈ విషయాన్ని తప్పుగా ముద్రించాయని చెప్తూ కన్నీటి పర్యంతం అయిందీ 24 ఏళ్ల బాక్సర్.
పలువురు నెటిజన్లు ఈ విషయంలో ఆమెకు ధైర్యం చెప్తూ.. ఈ మీడియా వార్తలను పట్టించుకోవద్దని, తామంతా ఆమెకు మద్దతుగా నిలుస్తామని చెప్పారు. మరికొందరు ఈ విషయాలు వదిలేసి బాక్సింగ్పై దృష్టి పెట్టాలని, మరోసారి దేశం గర్వించేలా చేయాలని సూచించారు.