హైదరాబాద్, ఆట ప్రతినిధి: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(హెచ్సీఏ) ఆధ్వర్యంలో జరుగుతున్న డివిజన్ లీగ్స్లో సాయి ప్రజ్ఞాన్రెడ్డి శతక జోరు దిగ్విజయంగా కొనసాగుతున్నది. కంబై న్డ్ డిస్ట్రిక్ జట్టుతో జరిగిన మ్యాచ్లో ప్రజ్ఞాన్రెడ్డి రెండు ఇన్నింగ్స్లో రెండు సెంచరీలు (147, 121) నమోదు చేసుకున్నాడు.
ఈస్ట్మారేడ్ పల్లి సీసీ తరఫున బరిలోకి దిగిన ఈ యువ బ్యాటర్ ప్రత్యర్థి బౌలర్లను సమర్థంగా ఎదుర్కొంటూ జట్టుకు కీలక పరుగులు సమకూర్చాడు. మరోవైపు బీడీఎల్తో జరిగిన మ్యాచ్లో ఇండియా సిమెంట్స్ తరఫున శ్రేయాస్ వాలా(204) డబుల్ సెంచరీతో విజృంభించాడు.