పారిస్: పారిస్-సెయింట్ జెర్మైన్, అర్జెంటీనా ఫుట్బాల్ ప్లేయర్ లియోనిల్ మెస్సీ రికార్డు క్రియేట్ చేశాడు. ఉత్తమ ఫుట్బాల్ క్రీడాకారులకు ఇచ్చే బాలన్ డార్ అవార్డును మెస్సీ ఏడోసారి గెలుచుకున్నాడు. అర్జెంటీనాకు చెందిన 34 ఏళ్ల మెస్సీ.. ఇటీవల కోపా అమెరికా టోర్నీలో తమ దేశ విజయంలో కీలక పాత్ర పోషించాడు. 2021 సంవత్సరంలో అతను అత్యధికంగా 40 గోల్స్ చేశాడు. బార్సిలోనాకు 28, పారిస్ సెయింట్ జెర్మైన్కు నాలుగు, అర్జెంటీనాకు 8 గోల్స్ చేశాడతను. ప్రపంచవ్యాప్తంగా ఉన్న 180 మంది జర్నలిస్టులు బాలన్ డార్ అవార్డు కోసం ఓటింగ్లో పాల్గొంటారు. అత్యధిక ఓట్లు వచ్చిన ప్లేయర్లను అవార్డు వరిస్తుంది. గత ఏడాది కరోనా కారణంగా ఈ అవార్డును ఇవ్వలేదు. 2009, 2010, 2011, 2012, 2015, 2019 సంవత్సరాల్లో ఈ అవార్డును మెస్సీ గెలుచుకున్నాడు.