పారిస్: మేటి ఫుట్బాల్ లియోనిల్ మెస్సీ ( Lionel Messi ) ప్లేయర్ ఇప్పుడు పారిస్కు చెందిన సెయింట్ జెర్మెయిన్ క్లబ్తో ఒప్పందం కుదుర్చుకున్న విషయం తెలిసిందే. బార్సిలోనా క్లబ్కు గుడ్బై చెప్పిన ఆ స్టార్ ప్లేయర్ ప్రస్తుతం పారిస్లోని ఓ హోటల్లో బస చేస్తున్నారు. లీ రాయల్ మోన్సియో హోటల్లో తన ఫ్యామిలీతో కలిసి అతను ఉంటున్నాడు. అయితే ఆ ఫైవ్స్టార్ హోటల్లో ఒక రాత్రి బస ఖరీదు రూ.17.5 లక్షలు (20వేల పౌండ్లు). భార్య, ముగ్గురు పిల్లలతో హోటల్లో ఉంటున్న మెస్సీ ఆ హోటల్లో ఉన్న సౌకర్యాలతో లగ్జరీ లైఫ్ను ఎంజాయ్ చేస్తున్నాడు. లీ రాయల్ హోటల్లో పూల్, సినిమా హాల్, ఫ్రెంచ్ రెస్టారెంట్లు ఉన్నాయి. పారిస్లోని అత్యంత ఖరీదైన ప్రాంతంలో ఆ హోటల్ ఉన్నది. గతంలో నెయ్మార్ కూడా ఈ హోటల్లోనే బస చేశాడు. పీఎస్జీ క్లబ్తో డీల్ కుదుర్చుకున్న అర్జెంటీనా ప్లేయర్ మెస్సీ.. ప్రతి ఏడాది ఆ ఒప్పందం ద్వారా సుమారు రూ.360 కోట్లు ఆర్జించనున్నాడు.