రియో డీ జెనిరో : ఫుట్బాల్ ప్రపంచకప్ గెలుచుకున్న అర్జెంటీనా జట్టు కెప్టెన్ లియోనెల్ మెస్సీ ఆ విజయం చిరకాలం గుర్తుండిపోయేలా తన సహచరులకు, సహాయ సిబ్బందికి బంగారు వర్ణంతో తయారుచేసిన ఐఫోన్లను బహూకరించనున్నాడు.
ఇందుకోసం 35 ఐఫోన్ల తయారీకి ఆర్డర్ ఇచ్చాడు. 24 క్యారట్ల బంగారంతో రూపొందించిన ఫోన్లపై ఆయా ఆటగాళ్ల పేర్లు, నంబర్లతో పాటు అర్జెంటీనా ఫుట్బాల్ సంఘం లోగో చిత్రీకరించారు. ఈ మేరకు మెస్సీ ఆ ఫోన్లను తన ఇంటివద్ద అందుకున్నట్టు సమాచారం. గత యేడాది జరిగిన ప్రపంచకప్ ఫైనల్లో అర్జెంటీనా 4-2తో ఫ్రాన్స్పై గెలుపొందిన సంగతి తెలిసిందే.