దోహా: అర్జెంటీనా దిగ్గజ ప్లేయర్, కెప్టెన్ లియోనెల్ మెస్సీ బుధవారం క్రొయేషియాతో జరిగే వరల్డ్కప్ సెమీస్ మ్యాచ్లో ఆడేది డౌట్గా ఉంది. అతనిపై ఫిఫా సస్పెన్షన్ విధించే అవకాశాలు ఉన్నాయి. నెదర్లాండ్స్తో జరిగిన క్వార్టర్స్ మ్యాచ్లో మెస్సీ అనుచితంగా ప్రవర్తించాడు. ఫిఫా రిఫరీ ఆంటోనియో మాటియో లాహోజ్ను మెస్సీ విమర్శించాడు. ఈ ఘటనను ఫిఫా సీరియస్గా తీసుకున్నది. ఒకవేళ ఫిఫా నియమావళి ప్రకారం చర్యలు తీసుకుంటే, అప్పుడు వరల్డ్కప్ సెమీస్లో క్రొయేషియాతో జరిగే మ్యాచ్కు మెస్సీ దూరం అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఫిఫా క్రమశిక్షణా కమిటీ త్వరలో మెస్సీపై నిర్ణయం తీసుకోనున్నది. స్పెయిన్ రిఫరీ లాహోజ్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఫిఫా క్రమశిక్షణ కమిటీ చర్యలు చేపట్టనున్నది.