రియో డి జెనెరో: కోపా అమెరికా ఫుట్బాల్ టోర్నీలో లియోనెల్ మెస్సీ సారథ్యంలోని అర్జెంటీనా అలవోక విజయంతో సెమీస్కు దూసుకెళ్లింది. ఆదివారం ఇక్కడ జరిగిన క్వార్టర్స్లో అర్జెంటీనా 3-0తో ఈక్వెడార్ను చిత్తుచేసింది. తొలి అర్ధభాగంలో ఇరు జట్లు హోరాహోరీగా తలపడినా రోడ్రిగో డిపౌల్ (40వ నిమిషంలో) ఒక్కడే గోల్ చేయడంతో మెస్సీసేన ఆధిక్యంలోకి వెళ్లింది. ఇక లాట్రో మార్టినెజ్ (80వ నిమిషంలో) బంతిని నెట్లోకి పంపగా.. అదనపు సమయంలో అర్జెంటీనా కెప్టెన్ మెస్సీ (90+3వ ని.లో) ఫ్రీ కిక్ సాయంతో గోల్ బాదాడు. దీంతో 76వ అంతర్జాతీయ గోల్ నమోదు చేసిన మెస్సీ.. దిగ్గజం పీలేకు ఒక్క అడుగుదూరంలో నిలిచాడు.